రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు

**రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు శ్రీధర్ బాబు, లక్మన్ కుమార్, సినీ ప్రముఖులు అలీ, శివారెడ్డి వంటి వారు హాజరైన ఈ సంబరాలకు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో స్టేడియం జనసంద్రమైంది.**

రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు
రామగుండం జనసంద్రం: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా-దీపావళి సంబరాలు

రామగుండం (అక్టోబర్ 19, ఆదివారం):                                                                               

రామగుండం నియోజకవర్గంలో దసరా మరియు దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. రామగుండం స్టేడియంలో జరిగిన ఈ వేడుకలకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ గారు మరియు వారి సతీమణి మనాలి ఠాకూర్ గారు హాజరై ప్రజలతో కలిసి దీపావళి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వర్యులు శ్రీ దూదిళ్ళ శ్రీధర్ బాబు గారు, మంత్రి వర్యులు అడ్లూరి లక్మన్ కుమార్ గారు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గారు, INTUC నాయకుడు జనక్ ప్రసాద్ గారు, జాతీయ SC కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్ గారు హాజరయ్యారు.

ప్రజలను ఆకట్టుకునేలా సినీ రంగ ప్రముఖులు అలీ గారు, శివరెడ్డి గారు, మొగలిరేకులు సాగర్ గారు, గీత మాధురి, మృదుల, రచ్చ రవి, రమేష్, బుల్లెట్ భాస్కర్, గౌతమ్ తదితరులు తమ వినోద కార్యక్రమాలతో హాజరైన జనాన్ని ఉత్సాహభరితులుగా మలిచారు.

ఈ వేడుకలు NTPC, మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి సంస్థల సౌజన్యంతో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన అధికారులకు, సిబ్బందికి, మరియు ప్రజలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా స్టేడియం జనసంద్రంలా మారి, అన్ని వయసుల ప్రజలు, మహిళలు, యువత, పిల్లలు భారీగా తరలి వచ్చి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో NTPC, సింగరేణి, మున్సిపల్, RFCL అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు వేలాదిగా ప్రజలు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.